
ఇదండీ నా పరిశోధన
పురాణమిత్యేవ న సాధు సర్వం
నచాపి కావ్యం నవమిత్యవద్యం
సంతః పరీక్షాంతరాత్ భజంతే
మూఢః పరప్రత్యయనేయ బుద్ధి:
-మహాకవి కాళిదాసు
(ప్రాచీనమైనదంతా స్వీకరించదగింది కాదు. అలానే కొత్తదాన్ని తిరస్కరించటం లేదా ఉదాసీనంగా చూడటం సరైన పద్ధతి కాదు. వివేకవంతులు పరీక్షగా ఆలోచన చేసి ఏది ఉత్తమమైందో దానిపట్ల అభిమానాన్ని చూపిస్తారు. విచక్షణతో ఆలోచించని వ్యక్తులు ఇతరులు ఏం చెబితే అది నమ్ముతూ ఉంటారు.)
ఈ ప్రయాణం
గమ్యం తెలియని, దారి లేని ఒక ప్రయాణం పరిశోధన. ఊహాజనిత గమ్యానికి దారుల్ని ఏర్పరచి, ఆ దారిలో ఉన్న పరిమళాల్ని హత్తుకొని, అడొచ్చిన కంటకాల్ని ఏరేస్తే చివరికి దొరికే అమృత ఫలమే పరిశోధన. పరిశోధన అంటేనే ఒక క్షీరసాగర మథనం. ఎన్నో విధాల పరిశీలన, ఎన్నోరకాల విశ్లేషణ, ఎన్నో రోజుల అన్వేషణ, మరెన్నో సంవత్సరాల నిరీక్షణ. వెరసి ఆ ఆలోచనామృతం సిద్ధాంత వ్యాసంగా మారుతుంది. ఒక చిన్న ఆలోచన అతి పెద్ద సిద్ధాంతంగా రూపుదిద్దుకునే క్రమంలో ఎన్ని సందేహాలు ఉద్భవిస్తాయో అన్ని సలహాలూ పలకరిస్తాయి. చివరికి పరిశోధకులు తమకు అందిన తీరాన్నో, కావలసిన తీరాన్నో చేరుకుంటారు. దానివలన డిగ్రీలు రావచ్చు. అవార్డులూ వరించవచ్చు. ఏది ఏమైనా పరిశోధన అంటేనే ఒక మహా ప్రయాణం. మన చుట్టూ ఎన్నో పరిశోధనలు. ఎన్నెన్నో ఆవిష్కరణలు. వాటన్నిటి గురించి అందరం చదివి తెలుసుకోవాలంటే వేల గంటలు ఖర్చు చేయాలి. కానీ అతి తక్కువ సమయంలో ఒక పరిశోధన గురించి మనం తెలుసుకోవాలంటే అది పరిశోధకుల మాటల్లోనే సాధ్యం. అందువలన పరిశోధనా ప్రస్థానాన్ని, ఆ ఫలితాన్ని, ఆ అనుభవాల్ని పంచుకోడానికి, పెంచుకోడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుందని, పరిశోధనల సారాంశాన్ని పరిశోధకుల మాటల్లోనే వినగలిగితే ఇంకా బాగుంటుందనే ఆలోచనతో రూపుదిద్దుకున్న ప్రయాణమిది.



ఇదండీ నా పరిశోధన
నిర్వహణ

డా. కె. కరుణశ్రీ
తెలుగు అధ్యాపకులు
డి. కె. ప్రభుత్వ మహిళా కళాశాల
నెల్లూరు.


డా. జి. పద్మప్రియ
పి. ఆర్. ఆర్. & వి. ఎస్. ప్రభుత్వ కళాశాల
విడవలూరు
నెల్లూరు జిల్లా
డా. ఎస్. ఎల్. వి. ఉమామహేశ్వర రావు
తెలుగు అధ్యాపకులు
జవహర్ నవోదయ విద్యాలయ్
కడపజిల్లా